26న రాష్ట్రస్థాయి డాక్​ అదాలత్​ 

26న రాష్ట్రస్థాయి డాక్​ అదాలత్​ 

హైదరాబాద్​,వెలుగు: పోస్టల్​ సేవలకు సంబంధించిన సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించేందుకు ఈ నెల 26న రాష్ట్రస్థాయి 'డాక్​ అదాలత్'ను నిర్వహించనున్నట్టు తెలంగాణ సర్కిల్​చీఫ్​ పొస్ట్​మాస్టర్ జనరల్​ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిర్వాదులను ఆన్​లైన్​ పద్ధతిలో స్వీకరించనున్నట్టు వెల్లడించారు. అదాలత్​లో ప్రజలు పొస్టల్​ సేవలకు సంబంధించిన సమస్యలను అదాలత్​ దృష్టికి తీసుకురావాలన్నారు.

డిపార్ట్​ మెంట్​కు సంబంధించి స్టాఫ్​ సమస్యలు, సర్వీస్​ వ్యవహారాలు, పెండింగ్​ సమస్యలను డాక్​ అదాలత్​ స్వీకరించద ని చెప్పారు.  ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన సమాచారాన్ని తెలంగాణ సర్కిల్​ అసిస్టెంట్​ డైరెక్టర్​ రంగారావు ఈ నెల 20 లోపు తెలియ జేయాలని సూచించారు. ఫిర్యాదు దారులు వారి మొబైల్​ నంబర్​, మెయిల్ ​ఐడీ, అడ్రస్​ను తెలియజేయాల్సి ఉంటుంది. అదాలత్​ జరిగే రోజు ఫిర్యాదుదారుల మొబైల్​ నంబర్​, ఈమెయిల్​ ఐడీలకు ఇచ్చే లింక్​​ ద్వారా  అదాలత్​లో పాల్గొనాలని అధికారులు పేర్కొన్నారు.