
హైదరాబాద్,వెలుగు: పోస్టల్ సేవలకు సంబంధించిన సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించేందుకు ఈ నెల 26న రాష్ట్రస్థాయి 'డాక్ అదాలత్'ను నిర్వహించనున్నట్టు తెలంగాణ సర్కిల్చీఫ్ పొస్ట్మాస్టర్ జనరల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిర్వాదులను ఆన్లైన్ పద్ధతిలో స్వీకరించనున్నట్టు వెల్లడించారు. అదాలత్లో ప్రజలు పొస్టల్ సేవలకు సంబంధించిన సమస్యలను అదాలత్ దృష్టికి తీసుకురావాలన్నారు.
డిపార్ట్ మెంట్కు సంబంధించి స్టాఫ్ సమస్యలు, సర్వీస్ వ్యవహారాలు, పెండింగ్ సమస్యలను డాక్ అదాలత్ స్వీకరించద ని చెప్పారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన సమాచారాన్ని తెలంగాణ సర్కిల్ అసిస్టెంట్ డైరెక్టర్ రంగారావు ఈ నెల 20 లోపు తెలియ జేయాలని సూచించారు. ఫిర్యాదు దారులు వారి మొబైల్ నంబర్, మెయిల్ ఐడీ, అడ్రస్ను తెలియజేయాల్సి ఉంటుంది. అదాలత్ జరిగే రోజు ఫిర్యాదుదారుల మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీలకు ఇచ్చే లింక్ ద్వారా అదాలత్లో పాల్గొనాలని అధికారులు పేర్కొన్నారు.