
గోదావరిఖని, వెలుగు: సింగరేణి హాస్పిటళ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం హాస్పిటల్వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు టి.రాజారెడ్డి మాట్లాడుతూ డిస్పెన్సరీ, ఏరియా హాస్పిటళ్లలో నాణ్యమైన వైద్యం అందించేందుకు కొత్త పరికరాలను తెప్పించి టెక్నీషియన్లను నియమించాలన్నారు.
నాణ్యమైన మందులను అందించాలని, సరిపడా డాక్టర్లను, సిబ్బందిని పర్మినెంట్గా నియమించాలని కోరారు. అనంతరం హాస్పిటల్ఏసీఎంవో అంబికకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో యూనియన్ఆర్జీ వన్ ఏరియా అధ్యక్ష, కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి, మండే శ్రీనివాస్, తోట నరహరి రావు, ఆసరి మహేశ్, ఎస్కే గౌస్, గజేంద్ర, పి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.