సింగరేణి హాస్పిటళ్లలో సమస్యలు పరిష్కరించాలి : సీఐటీయూ

సింగరేణి హాస్పిటళ్లలో సమస్యలు పరిష్కరించాలి : సీఐటీయూ

గోదావరిఖని, వెలుగు: సింగరేణి హాస్పిటళ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం హాస్పిటల్​వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్​ రాష్ట్ర అధ్యక్షుడు టి.రాజారెడ్డి మాట్లాడుతూ డిస్పెన్సరీ, ఏరియా హాస్పిటళ్లలో నాణ్యమైన వైద్యం అందించేందుకు కొత్త పరికరాలను తెప్పించి టెక్నీషియన్లను నియమించాలన్నారు.

నాణ్యమైన మందులను అందించాలని, సరిపడా డాక్టర్లను, సిబ్బందిని  పర్మినెంట్‌‌‌‌‌‌‌‌గా నియమించాలని కోరారు. అనంతరం హాస్పిటల్​ఏసీఎంవో అంబికకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో యూనియన్​ఆర్జీ వన్ ఏరియా అధ్యక్ష, కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి, మండే శ్రీనివాస్, తోట నరహరి రావు, ఆసరి మహేశ్‌‌‌‌‌‌‌‌, ఎస్‌‌‌‌‌‌‌‌కే గౌస్, గజేంద్ర, పి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.