హిస్టరీ లెక్చరర్లతో సివిక్స్ పాఠాలు

హిస్టరీ లెక్చరర్లతో సివిక్స్ పాఠాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సర్కారు జూనియర్ కాలేజీల్లో సివిక్స్ లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని పీడీఎస్ యూ నేతలు ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం ఆ సంఘం రాష్ర్ట అధ్యక్షుడు ఎం.పరశురాం ఆధ్వర్యంలోని బృందం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు.

హిస్టరీ లెక్చరర్లతో సివిక్స్​పాఠాలు చెప్పిస్తున్నారని చెప్పారు. ఈ రెండు సబ్జెక్టులకు ఒకే లెక్చరర్ ఉండటంతో, బోధనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. తక్షణమే ఖాళీగా ఉన్న సివిక్స్, హిస్టరీ పోస్టులను భర్తీ చేయాలని కోరారు.