సీఆర్పీఎఫ్ బంకర్ సహా మూడు చోట్ల ఉగ్రదాడులు.. ఒకరు మృతి

సీఆర్పీఎఫ్ బంకర్ సహా మూడు చోట్ల ఉగ్రదాడులు.. ఒకరు మృతి

జమ్ము కశ్మీర్‌‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఒక సీఆర్పీఎఫ్ బంకర్ సహా వేర్వేరు ప్రాంతాల్లో వరుసగా దాడులకు తెగబడ్డారు. వరుసగా జరిగి మూడు టెర్రిరిస్టుల  దాడుల్లో  ఓ వ్యక్తి   ప్రాణాలు కోల్పోగా.. మరోకరికి  గాయాలయ్యాయి. ఇందులో రెండు ఘటనలు  శ్రీనగర్‌‌లోనే  జరిగాయి. మరో  ఘటన అనంతనాగ్‌లో  జరిగింది. సీఆర్పీఎఫ్ బంకర్‌‌పై టెర్రరిస్టులు గ్రెనెడ్ విసిరారు. అయితే  ఈ దాడిలో  ఎవరికీ గాయాలు  కాలేదు. మొదటి దాడి శనివారం సాయంత్రం  శ్రీనగర్ లోని   కర నగర్ లో  మజీద్ అహ్మద్  గోజ్రిపై టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో  మజీద్ తీవ్రంగా  గాయపడ్డాడు. హాస్పిటల్ కు  తరలించగా.. చనిపోయినట్లు  డాక్టర్లు చెప్పారు. తర్వాత   రాత్రి 8 గంటల  టైంలో  బట్మాలు ఏరియాలో  కాల్పులు  జరిపారు టెర్రరిస్టులు. ఈ ఘటనలో  ఒకరికి గాయాలయ్యాయి.

మరిన్ని వార్తల కోసం..

‘కొండ పొలం’ హీరో పేరు మార్చాలె.. లేకుంటే అడ్డుకుంటం

రేవ్‌పార్టీలో షారూక్ ఖాన్ కొడుకు అరెస్ట్