కమల్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌‌పై క్లారిటీ

కమల్  నెక్స్ట్ ప్రాజెక్ట్‌‌పై  క్లారిటీ

గతేడాది ‘విక్రమ్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్‌‌ను అందుకున్న కమల్ హాసన్  ప్రస్తుతం ‘ఇండియన్2’ సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నారు. అలాగే ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.  మరోవైపు కమల్  నెక్స్ట్ ప్రాజెక్ట్‌‌పై తమిళ మీడియాలో కొన్ని గాసిప్స్ వస్తున్నాయి. వీటిపై మంగళవారం కమల్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే ఆయన తర్వాతి చిత్రాలు మణిరత్నం, హెచ్.వినోద్ దర్శకత్వంలో ఉన్నాయని అనౌన్స్‌‌మెంట్ వచ్చింది. 

అయితే వినోద్ డైరెక్షన్‌‌ చేయబోయే మూవీకి స్ర్కిప్ట్ వర్క్ పూర్తవలేదని, మరింత ఆలస్యం అయ్యే చాన్స్ ఉన్నట్టుగా కోలీవుడ్‌‌లో కథనాలొచ్చాయి. కానీ అవన్నీ పుకార్లేనని కొట్టి పారేస్తూ.. ఇప్పుడు చేయబోయేది హెచ్.వినోద్ దర్శకత్వంలోనేనని కమల్ నిన్న సోషల్ మీడియాలో ప్రకటించారు. ‘అండ్ ఇట్ బిగిన్స్’ అంటూ రైజ్ టు రూల్ అనే పవర్‌‌‌‌ఫుల్ వీడియోను పోస్ట్ చేశారు. ఇది ఆయన నటిస్తున్న 233వ చిత్రం. ఆర్.మహేంద్రన్‌‌తో కలిసి కమలే స్వయంగా నిర్మిస్తున్నారు.