యాదాద్రి, వెలుగు : కరోనాను కట్టడి చేయడంలో భాగంగా లాక్డౌన్ను మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు యాదాద్రి కలెక్టర్ అనితా రామచంద్రన్ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా గురువారం నుంచి అన్ని రకాల వ్యాపారాలను మధ్యాహ్నం వరకే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు ఉదయం 7నుంచి సాయంత్రం 5 వరకు షాపులు తెరిచి ఉంచేందుకు అనుమతి ఉండగా, నేటినుంచి మధ్యాహ్నం 1 గంటకే మూసివేయన్నారు.
ఆ తర్వాత ఎవరైనా షాపులు తెరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, మొబైల్ రైతు బజార్లకు కూడా ఇదే వర్తిస్తుందని చెప్పారు. బ్యాంకులు మాత్రం సాయంత్రం 4 గంటల వరకు, మెడికల్ షాపులు సాయంత్రం 5 వరకు, అపోలో ఫార్మసీ మాత్రం 24 గంటలూ తెరిచి ఉంటాయన్నారు.