శ్రీశైలంలో బ‌ట్ట‌ల దుకాణంలో చోరీ 

శ్రీశైలంలో బ‌ట్ట‌ల దుకాణంలో చోరీ 

శ్రీశైలంలోని బ‌ట్ట‌ల దుకాణంలో చోరీ జ‌రిగింది.  నిన్న‌(జ‌న‌వ‌రి6) అర్ద‌రాత్రి సిద్దిరామ‌ప్ప షాపింగ్ కాంప్లెక్స్ లోని షాపు నెంబ‌రు 12 లో  అరవింద్‌ రామ్ రాజ్ అనే వ్య‌క్తి బ‌ట్ట‌ల దుకాణాన్ని న‌డుపుతున్నాడు. జ‌న‌వ‌రి 6 వ తేది సాయంత్రం షాపు మూసేసి తాళం వేసి ఇంటికి వెళ్లాడు.  మ‌రుస‌టి రోజు అన‌గా జ‌న‌వ‌రి 7న ఉద‌యం వ‌చ్చే చూసేస‌రికి షాపు తాళాలు ప‌గులకొట్టి ఉన్నాయి.  షాపులోని సామాను చింద‌ర‌వంద‌ర‌గా ఉన్నాయి. షాపులో దొంగ‌లు ప‌డ్డార‌ని గుర్తించిన షాపు య‌జ‌మాని పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.  సీసీ కెమెరా వైర్ల‌కు క‌ట్ చేసి దొంగ‌త‌నాని పాల్ప‌డ్డారు.  షాపులోని కొన్ని విలువైన చీర‌ల‌తొ పాటు ల‌క్ష రూపాయిల న‌గ‌దు చోరీకి గురైన‌ట్లు గుర్తించారు
 
షాపు య‌జమాని ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు చోరీ జ‌రిగిన ప్ర‌దేశాన్ని ప‌రిశీలించారు. దొంగ తాళాన్ని కూడా ఎత్తుకెళ‌డంతో మిగ‌తా షాపుల వారు ఆందోళ‌న చెందుతున్నారు.  ఈ మ‌ధ్య కాలంలో శ్రీశైలంలో దొంగ‌త‌నాలు ఎక్కువ‌కావ‌డంతొ ప్ర‌జ‌లు భ‌య‌ప‌డుతున్నారు.