ఢిల్లీలో కాళ్లు పట్టుకొని లక్ష్మణ్ ఎంపీ అయిండు

ఢిల్లీలో కాళ్లు పట్టుకొని లక్ష్మణ్ ఎంపీ అయిండు

హైదరాబాద్: ఢిల్లీ నేతల కాళ్లు పట్టుకొని బీజేపీ నేత లక్ష్మణ్ ఎంపీ అయిండని సీఎం కేసీఆర్ ఆరోపించారు. ఆదివారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ మాట్లాడారు. టీఆర్ఎస్ సర్కారులో కట్టప్ప ఉన్నాడంటూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. లక్ష్మణ్ ఓ సన్నాసి అని, కట్టప్ప... కాకరకాయ అంటూ ఏదేదో మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. అసలు లక్ష్మణ్ కు కట్టప్ప స్టోరీ ఏంటో తెలుసా అని ప్రశ్నించారు. కట్టప్ప అనే వ్యక్తి... కథ చివరిలో బాహుబలికి పట్టం కడ్తాడని గుర్తు  చేశారు. ముషీరాబాద్ లో ముఠా గోపాల్ కొట్టిన దెబ్బకు లక్ష్మణ్ కు గింగిరాలు తిరిగాయని, అలాంటి వ్యక్తి తమ ప్రభుత్వం గురించి మాట్లడుతాడా అని కేసీఆర్ ఫైర్ అయ్యారు.