రాష్ట్ర అవతరణ వేడుకల్లో జెండా ఆవిష్కరించేది వీరే..

రాష్ట్ర అవతరణ వేడుకల్లో జెండా ఆవిష్కరించేది వీరే..

జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. వివిధ జిల్లా కేంద్రాల్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని, జెండా ఆవిష్కరణ చేసే వారి పేర్లను ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, జెడ్పీ చైర్ పర్సన్లు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.

హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లో జరిగే కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి SK జోషి, DGP మహేందర్ రెడ్డి కూడా పబ్లిక్ గార్డెన్స్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు.

పబ్లిక్ కు ఇబ్బంది కలగకుండా అవతరణ వేడుకలు నిర్వహించాలని ఇటీవలే సీఎం కేసీఆర్ నిర్ణయించారు.