ధరణిని రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్​ని బొందవెట్టాలే: సీఎం కేసీఆర్​

ధరణిని రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్​ని బొందవెట్టాలే: సీఎం కేసీఆర్​
  • మళ్లీ బీఆర్​ఎస్​ఏ అధికారంలోకి వస్తుందని ధీమా

అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్​ని రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్​ని ప్రజలు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించి.. బొందవెట్టాలని సీఎం కేసీఆర్​అన్నారు. అసెంబ్లీలో రాష్ట్రాభివృద్ధిపై జరిగిన దీర్ఘకాలిక చర్చపై సీఎం సుదీర్ఘంగా ప్రసంగించారు. ధరణి వల్ల కబ్జా దారులు, పైరవీకారులు పోయారని.. రైతు వేలు ముద్ర లేనిదే భూ బదిలీ సాధ్యం కాదని అన్నారు. 

కాంగ్రెస్​ధరణిని రద్దు చేస్తామని చెప్పడాన్ని ఆయన ఖండించారు. సంక్షేమంలో, అభివృద్ధిలో మొదటి స్థానంలో రాష్ట్రాన్ని నిలిపినందుకు తనకు  పిండం పెడతారా అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ని ప్రశ్నించారు. తాము చేసిన మంచేంటో.. కాంగ్రెస్​ చేసిందేంటో ప్రజలకు తెలుసని.. పిండం ఎవరికి పెట్టాలో ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు. 

కాంగ్రెస్​ ప్రభుత్వం నీటి తీరువా కట్టాలని రైతుల మెడపై కత్తిపెట్టి వేధించిందని సీఎం ఆరోపించారు. బీఆర్​ఎస్​ అధికారంలోకి వచ్చాక నీటి తీరువాను రద్దు చేసినట్లు వెల్లడించారు. 

కాళేశ్వరమే లేకపోతే నీళ్లేక్కడివి..

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ అవాస్తవాలు ప్రచారం చేస్తోందని సీఎం కేసీఆర్​ ఆరోపించారు. ఆ ప్రాజెక్టు లేకపోతే కొండనాయక్​సాగర్ తదితర ప్రాజెక్టులకి నీరు ఎలా వచ్చేవని ప్రశ్నించారు. కాంగ్రెస్​ వస్తే నీరు రావు.. కరెంటు రాదని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ నేతలా తమకు నీతులు చెప్పేది అని ప్రశ్నించారు. కాంగ్రెస్​ అంటే కష్టాల చరిత్ర అని విమర్శించారు.