అస్సాం సీఎం ను బర్తరఫ్ చేయాలి

అస్సాం సీఎం ను బర్తరఫ్ చేయాలి

నా ప్రాణం తెలంగాణ, నా బతుకు నేను బతుకుతున్నా..నేను చచ్చినా సరే కేంద్ర విద్యుత్ సంస్కరణలను తెలంగాణలో అమలుచెయ్యబోమన్నారు సీఎం కేసీఆర్. రాయగిరి  బహిరంగ సభలో మాట్లాడిన ఆయన ..అసలు బీజేపీకి సంస్కారముందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పుట్టుకపై అస్సాం సీఎం తప్పుగా మాట్లాడడం సంస్కారమా? హిందు ధర్మమా అని ప్రశ్నించారు. సంస్కారహీనంగా మాట్లాడిన అస్సాం సీఎంను ప్రధాని మోడీ బర్త రఫ్ చేయాలన్నారు. బీజేపీ 8 ఏళ్లలో ఏకానా పనిచేయలేదన్నారు. అన్నిరంగాల్లో అట్టర్ ప్లాప్ గవర్నమెంట్ బీజేపీ అని అన్నారు. 

 అంతేకాదు..సోషల్ మీడియాతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారని బీజేపీపై  ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. మోడీ పాలనలో దేశంలో  లక్షలాదిగా పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. మోడీ వల్ల దేశంలో ఎవరికి లాభం జరిగిందన్నారు.  బీజేపీ పాలనలో దేశం నాశనమయ్యిందన్నారు. దేశంలో 65 వేల TMC నీరుంటే.. 35 వేల TMCలు కూడా వాడటం లేదన్నారు. దేశంలో ఆకలి పెరుగుతుందన్నారు.115 దేశాల్లో సర్వే చేస్తే మన దేశం స్థానం 101 ప్లేస్ లో ఉందన్నారు. భారత దేశాన్ని ఆకలి రాజ్యాన్ని చేస్తారా అని ప్రశ్నించారు.

మరిన్ని వార్తల కోసం..

త్వరలో వాహన చట్టంలో మార్పులు