బీఆర్​ఎస్, ఎంఐఎం మంచి దోస్తులు.. మాది బరాబర్ సెక్యులర్​ పార్టీనే..: సీఎం కేసీఆర్​

బీఆర్​ఎస్, ఎంఐఎం మంచి దోస్తులు.. మాది బరాబర్ సెక్యులర్​ పార్టీనే..: సీఎం కేసీఆర్​

బీఆర్​ఎస్, ఎంఐఎం ఏళ్లుగా మంచి దోస్తులని సీఎం కేసీఆర్​అన్నారు. అసెంబ్లీలో రాష్ట్రాభివృద్ధిపై జరిగిన దీర్ఘకాలిక చర్చపై సీఎం సుదీర్ఘంగా ప్రసంగించారు.  తమది సెక్యులర్​పార్టీ అని చెబుతూ.. అదే అంశాన్ని నేరుగా ప్రజల ముందే ఉంచి ఇప్పటివరకు ఓట్లు అడిగామని ఇక ముందు బీఆర్​ఎస్​ అదే విధానం అనుసరిస్తుందని తెలిపారు. 

ఓట్ల కోసం మతకుంపట్లు రగిలించి రాజకీయ లబ్ధి పొందాలనుకునే రకం తాము కాదని చెప్పారు. రానున్న రోజుల్లో సైతం బీఆర్​ఎస్​, ఎంఐఎం కలిసి పని చేస్తుందని స్పష్టం చేశారు. 

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తాము పని చేస్తున్నామని.. కుల మతాలు చూడట్లేదని తెలిపారు. ఇప్పటికే బ్రాహ్మణుల సంక్షేమానికి ఏటా బడ్జెట్​లో నిధులు కేటాయిస్తున్నామని.. వారి జీత భత్యాలు ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు.