కన్నీరు పెట్టుకున్న కేసీఆర్

కన్నీరు పెట్టుకున్న కేసీఆర్

నరసింహన్ కు వీడ్కోలు పలికిన కేసీఆర్ కన్నీరుపెట్టుకున్నారు. తొమ్మిదిన్నర ఏళ్లుగా తెలంగాణకు గవర్నర్ గా పని చేసిన నరసింహన్ శనివారం వీడ్కోలు చెప్పేశారు. దీంతో భావోద్వేగానికి గురైన కేసీఆర్ కన్నీరుపెట్టుకున్నారు. ఎక్కువ కాలంగా పని చేసిన గవర్నర్ గా నరసింహన్ రికార్డుకెక్కారని గుర్తు చేసుకున్నారు.

తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా సమభావనతో పని చేసిన నరసింహన్ దూరం కావడంతో పలువురు నేతలు కంటతడి పెట్టుకున్నారు. పండుగలు, ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలను గొప్పగా జరిపించి అందరి మనసులను గెలుచుకున్నారని చెప్పారు. తెలుగు ప్రజలను వీడి వెళ్లిపోవడం బాధకరంగా ఉందని గవర్నర్ భార్య కూడా కన్నీరుపెట్టుకున్నారు. వీడ్కోలు కార్యక్రమం తర్వాత నరసింహన్ దంపతులు బైబై అంటూ బెంగళూరుకు వెళ్లారు.