ఢిల్లీకి కేసీఆర్.. మే 4న బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభం

ఢిల్లీకి కేసీఆర్.. మే 4న బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభం

సీఎం కేసీఆర్  ఇవాళ (మే 2) ఢిల్లీ వెళ్లనున్నారు.  ఢిల్లీలోని వసంత్  విహార్ లో నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని మే 4న   ప్రారంభించనున్నారు.  జాతీయ స్థాయి బీఆర్ఎస్ కార్యకలాపాలన్నీ ఇక్కడి నుంచే జరగనున్నాయి. మే 4 న పార్టీ ప్రారంభోత్సవం తర్వాత తిరిగి హైదరాబాద్ కు రానున్నారు. అప్పటి వరకు కేసీఆర్  ఢిల్లీలోనే ఉండనున్నారు.

బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా కేసీఆర్ రాజశ్యామల యాగం చేయనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమలో మంత్రులు, ఎమ్మెల్యేలు సహా 200 మంది ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.  ఢిల్లీలోని వసంత్ విహార్ లో  2021 సెప్టెంబర్ లో  భవనానికి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఇపుడు పూర్తి చేసి ప్రారంభిస్తున్నారు.