ఆర్టీసీ సమ్మెపై క్యాంప్ ఆఫీసులో సమావేశమయ్యారు సీఎం కేసీఆర్. ఈ సమావేశంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ తో పాటు ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో పాటు ఆర్టీసీ చేస్తున్న ప్రత్నామ్నాయ ఏర్పాట్లపై చర్చించారు. ఇప్పటి వరకు ఎన్ని బస్సులు తిరుగుతున్నాయనే దానిపై అధికారులు… సీఎంకు రిపోర్టు ఇచ్చిన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 21 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం అవుతుండటంతో.. విద్యార్ధులకు బస్సు సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఈ లోపు అద్దె బస్సులు పెంచి, తాత్కాలికంగా డ్రైవర్లు, కండక్టర్లను నియమించాలని సూచించారు. అటూ కార్మికుల సమ్మెకు ఉద్యోగా సంఘాలు, రాజకీయ పార్టీలు సపోర్టు చేయడంపైనా చర్చించినట్లు తెలుస్తోంది.

