విజయనిర్మల భౌతికకాయానికి కేసీఆర్ నివాళి

విజయనిర్మల భౌతికకాయానికి కేసీఆర్ నివాళి

హైదరాబాద్: ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల పార్థీవదేహాన్ని సీఎం కేసీఆర్ సందర్శించారు. నానక్‌రామ్‌గూడలోని నివాసానికి చేరుకున్న సీఎం కేసీఆర్ విజయనిర్మల భౌతికకాయంపై పూలమాల ఉంచి నివాళులర్పించారు. కన్నీరు మున్నీరు అవుతున్న కృష్ణను సీఎం ఓదార్చారు. సీఎం వెంట మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు.