కామారెడ్డి : స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని పరామర్శించారు సీఎం కేసీఆర్. పోచారం తల్లి పాపవ్వ(107) మంగళవారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. బుధవారం ఆమె అంత్యక్రియలు జరిగాయి. ఇవాళ సీఎం కేసీఆర్ ప్రత్యేక హెలికాప్టర్లో బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి బాన్సువాడ చేరుకుని అక్కడున్నంచి రోడ్డుమార్గం ద్వారా పోచారం వెళ్లారు. పోచారం నివాసం చేరుకున్న సీఎం కేసీఆర్.. స్వర్గీయ పాపవ్వ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.