రాష్ట్రంలో కేసీఆర్ రాచరిక పాలన నడుస్తోంది

రాష్ట్రంలో కేసీఆర్ రాచరిక పాలన నడుస్తోంది

హైదరాబాద్ : రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం రాచరిక పాలన కొనసాగిస్తోందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ ఆరోపించారు. కేసీఆర్ సర్కారు తెలంగాణ ప్రజల సంపద దోచుకుంటోందని మండిపడ్డారు. మేడ్చల్ జిల్లాలో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించిన చుగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మోడీ ఆశయాలకు అనుగుణంగా దేశ ప్రజలు మోడీ వెంట ఉన్నారని, ఆయన ఆలోచనలు, పనులను అందరూ గుర్తిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లా పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించి బీజేపీలో లోటుపాట్లపై చర్చిస్తున్నట్లు తరుణ్ చుగ్ వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు బూత్ స్థాయి కార్యకర్తల నుంచి ప్రతి ఒక్కరూ సర్వశక్తులు ఒడ్డుతున్నారని చెప్పారు.

For more news..

కేసీఆర్ దోపిడీకి కేంద్రం సహకరిస్తోంది

బంగ్లాపై భారత్ ఘన విజయం