హుజూరాబాద్‌‌ ప్రచారానికి నేనూ వెళ్తా

హుజూరాబాద్‌‌ ప్రచారానికి నేనూ వెళ్తా
  • కొందరు మంత్రుల పనితీరుకు ఎన్నిక గీటురాయి
  • కేబినెట్‌‌ భేటీలో కేసీఆర్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: హుజూరాబాద్‌‌ ఉప ఎన్నిక ప్రచారానికి తానూ వెళ్తానని శనివారం కేబినెట్‌‌ భేటీలో సీఎం కేసీఆర్​ అన్నట్లు తెలిసింది. ఈ ఉప ఎన్నిక కొందరు మంత్రుల పనితీరుకు గీటురాయి అని, చెప్పిన పని సరిగా చేయాలని ఆదేశించారు. ఉప ఎన్నికలో  నూటికి నూరుపాళ్లు గెలిచేది టీఆర్‌‌ఎస్సేనని, ఎవరూ  ఎలాంటి టెన్షన్‌‌ పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నట్లు సమాచారం. అదే సమయంలో బాధ్యత అప్పగించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, నేతలు నిర్లక్ష్యంగా ఉండొద్దని ఆయన సూచించారు.