మోడీ పాలనతో విసిగిపోయి బీఆర్ఎస్ పెట్టినం : కేసీఆర్

మోడీ పాలనతో విసిగిపోయి బీఆర్ఎస్ పెట్టినం : కేసీఆర్

బీఆర్ఎస్ పార్టీపై వస్తున్న విమర్శలపై సీఎం కేసీఆర్ స్పందించారు. తమకు పిచ్చిలేసి బీఆర్ఎస్ పార్టీ పెట్టలేదని.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో విసిగిపోయి జాతీయ పార్టీ పెట్టానని చెప్పారు. దేశంలో 157 కొత్త మెడికల్ కాలేజీలు వస్తే.. అందులో తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని కేసీఆర్ వాపోయారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గురించి అడిగితే.. ఏం చేసుకుంటారో చేస్కోండన్నట్లు నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని కేంద్రపై కేసీఆర్ ఫైర్ అయ్యారు.  

ప్రధాని మోడీ పార్లమెంట్‭లో దేశానికి సంబంధించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. మోడీ ప్రసంగమంతా అబద్ధాలేనని.. పార్లమెంట్‭లో అదానీ గురించి మాట్లాకుండా మాట దాటవేశారని ఫైర్ అయ్యారు. దేశాభివృద్ధి, ప్రజల గురించి ఆయన ఒక్క మాట కూడా మాట్లడలేదని కేసీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రజలకు ఏమి చేయలేదని ప్రజలను నమ్మించి.. బీజేపీ అధికారంలోని వచ్చిందని కేసీఆర్ అన్నారు. బీజేపీని నమ్మి ఓటేసిన ప్రజలకు ప్రధాని మోడీ మొండిచేయి చూపించారని విమర్శించారు.