
నిజామాబాద్, వెలుగు: రెండుసార్లు ప్రజల ఆశీర్వాదంతో గెలిచి నగరాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నానని బీఆర్ఎస్ అర్బన్ అభ్యర్థి గణేశ్ గుప్తా పేర్కొన్నారు. నగరంలోని ప్రతి గల్లీ డెవలప్ చేశానని, సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అందని ఇల్లంటూ లేదన్నారు. బుధవారం ఆయన 25, 48 డివిజన్లో ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మెనిఫెస్టోను ప్రజలకు వివరించారు. మేయర్దండు నీతూ కిరణ్, లీడర్లు సిర్ప రాజు, బొబ్బిలి మురళి, సీతారాం, సాయి పాల్గొన్నారు.