ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ జనగామ జిల్లాలోపర్యటించనున్నారు. కరోనా ఆంక్షలన్నీ సడలిస్తున్న నేపథ్యంలో భారీ జన సమీకరణతో సత్తా చాటేందుకు టీఆర్ఎస్ వర్గాలు ఏర్పాట్లు చేశాయి. హైదరాబాద్ నుండి జనగామ వరకు దారిపొడవునా గులాబీ ఫ్లెక్సీలు.. స్వాగత తోరణాలతో ముంచెత్తారు. పార్టీ క్యాడర్ కు కొత్త తెచ్చే రీతిలో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో అందరి దృష్టి కేసీఆర్ పర్యటనపై పడేలా సన్నాహాలు చేశారు. కేసీఆర్ హైదరాబాద్ నుంచి బయలుదేరి.. వచ్చి.. తిరిగి వెళ్లే వరకు ఆయన పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.
ఉదయం 11.35 గంటలకు కలెక్టరేట్ ప్రాంగణంలోని హెలిపాడ్ వద్ద హెలికాప్టర్ దిగుతారు.
11.45 గంటలకు సమీకృత కలెక్టరేట్ భవనం ప్రారంభం. అనంతరం మధ్యాహ్న భోజనం చేస్తారు.
2.50 గంటల వరకు జిల్లా అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో సమీక్ష నిర్వహిస్తారు.
3 గంటలకు టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం వద్దకు రోడ్డుమార్గాన బయలుదేరుతారు.
3.05 గంటలకు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.
3.25 గంటలకు బహిరంగ సభా వేదిక వద్దకు చేరుకుంటారు.
3.30 గంటలకు సీఎం కేసీఆర్ ప్రసంగం.
5 గంటలకు ప్రసంగం ముగింపు.
5.15 గంటలకు హెలికాప్టర్లో హైదరాబాద్కు వెళ్తారు.
ఇవి కూడా చదవండి
సూపర్, మెగా, బాహుబలి లెవల్లో అడుక్కున్నరు
15సార్లు గుట్టకు వచ్చి.. ఒక్కసారైనా భువనగిరి రాకపోవడం బాధాకరం
దొరా.. కోర్టులు మొట్టికాయలు వేస్తేకానీ గుర్తురాదా?