
హైదరాబాద్, వెలుగు: హుస్నాబాద్ నుంచి సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార శంఖారావం పూరించనున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రిలీజైన నేపథ్యంలో ఈనెల 15న తెలంగాణ భవన్లో పార్టీ అభ్యర్థులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వారికి బీఫాంలు అందజేయనున్నారు. పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. తర్వాత హైదరాబాద్నుంచి నేరుగా హుస్నాబాద్కు చేరుకుని.. ప్రచార సభలో పాల్గొననున్నారు. 18 వ తేదీ వరకు జిల్లాల్లో కేసీఆర్ పర్యటించి ప్రచారం చేయనున్నారు. 16న జనగామ, భువనగిరి నియోజకవర్గాల్లో, 17న సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో, 18న జడ్చర్ల, మేడ్చల్ నియోజకవర్గాల్లో సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. కొంత గ్యాప్ ఇచ్చి.. దసరా తర్వాత మళ్లీ ఎన్నికల ప్రచారంలోకి కేసీఆర్ దిగనున్నారు. నామినేషన్ల దాఖలుకు నవంబర్పదో తేదీ వరకు గడువు ఉండటంతో అంతకు ఒకరోజు ముందే గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో కేసీఆర్ నామినేషన్దాఖలు చేయనున్నారు. నవంబర్9న ఉదయం సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వేంకటేశ్వర స్వామి దేవాలయంలో నామినేషన్ పత్రాలు పెట్టి ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత గజ్వేల్లో, కామారెడ్డికిలో నామినేషన్ వేస్తారు. కామారెడ్డిలో సభలో పాల్గొంటారు.
కోనాయపల్లి, హుస్నాబాద్ సెంటిమెంట్
హుస్నాబాద్తో ప్రచారం ప్రారంభించడం అనే సెంటిమెంట్ను కేసీఆర్ మళ్లీ కొనసాగిస్తున్నారు. 2018లో సెప్టెంబర్6న అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్.. అప్పుడు హుస్నాబాద్ బహిరంగ సభతోనే ఎన్నికల ప్రచారం షురూ చేశారు. ఈసారి హుస్నాబాద్లోనే తొలి ప్రచార సభ నిర్వహిస్తున్నట్టు ప్రగతి భవన్నుంచి అధికారికంగా సమాచారం ఇచ్చారు. కేసీఆర్ఎప్పుడు ఎన్నికల్లో పోటీ చేసినా కోనాయపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలు పెట్టి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాతే నామినేషన్ దాఖలు చేస్తారు.
70 ప్రచార సభలకు కేసీఆర్
నవంబర్ 30న రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండటంతో రాష్ట్రవ్యాప్తంగా 70 ప్రచార సభల్లో కేసీఆర్ పాల్గొనేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు. ఎన్నికల ప్రచార గడువు ముగిసే నవంబర్28 సాయంత్రం 6 గంటల వరకు ఈ ప్రచార సభలు ఉండనున్నట్టు సమాచారం. నవంబర్15 నుంచి వరుసగా కేసీఆర్ సభలు ఉండే అవకాశముంది. ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలపై బీఆర్ఎస్ చీఫ్ ఎక్కువగా ఫోకస్చేసినట్టు తెలుస్తోంది. కొన్ని చోట్ల రెండు నియోజకవర్గాలకు కలిపి ఒక ప్రచార సభ ఉంటుందని సమాచారం. ఎన్నికల షెడ్యూల్రావడంతో మంత్రులు కేటీఆర్, హరీశ్రావు ఒక్కో నియోజకవర్గంలో కనీసం రెండేసి ప్రచార సభల్లో పాల్గొననున్నట్టు చెప్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కేటీఆర్రోడ్షోలకు ప్లాన్చేస్తున్నారు. మిగతా చోట్ల ప్రచార సభలు ఏర్పాటు చేస్తున్నారు. నిజామాబాద్ఉమ్మడి జిల్లా ప్రచార బాధ్యతలు ఎమ్మెల్సీ కవిత చూసుకోనున్నారు.
గ్రేటర్తో పాటు ఉత్తర తెలంగాణ బాధ్యతలు మంత్రి కేటీఆర్, ఉమ్మడి మెదక్తో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాల ప్రచారాన్ని మంత్రి హరీశ్రావుకు అప్పగించారు. ఎన్నికల షెడ్యూల్వచ్చే లోపే కేటీఆర్, హరీశ్రావు 60కి పైగా నియోజకవర్గాలను చుట్టేశారు. ఎన్నికల షెడ్యూల్రావడానికి కొద్దిసేపటి ముందే జయశంకర్భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ను కేటీఆర్ ప్రారంభించారు. ఆ తర్వార అధికారిక కార్యక్రమాలను ఆపేసి పార్టీ ప్రచార సభల్లో పాల్గొన్నారు. మంత్రి హరీశ్రావు ప్రగతి భవన్లోనే ఉండి ప్రభుత్వపరంగా చక్కబెట్టాల్సిన కార్యక్రమాలపై ఫోకస్చేశారు. బతుకమ్మ పండుగ, దసరా, దీపావళి పండుగలను మినహాయించి కేటీఆర్, హరీశ్రావు నిత్యం ప్రజల్లోనే ఉండేలా షెడ్యూల్సిద్ధం చేస్తున్నారు.