కేజ్రీవాల్ ను కలిసిన కేసీఆర్

కేజ్రీవాల్ ను కలిసిన కేసీఆర్

న్యూఢిల్లీ: ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో రాష్ట్ర సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్... ఇవాళ సాయంత్రం కేజ్రీవాల్ తో భేటీ కానున్నారు. అనంతరం కేజ్రీవాల్ తో కలిసి అక్కడి ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ‘మెహల్ల క్లినిక్’ ను, అలాగే మోతీ బాగ్ లోని సర్వోదయ పాఠశాలను కేసీఆర్ సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ఆయన వాటి పని తీరును పరిశీలించనున్నారు.

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన దేశ యాత్ర మొదలు పెట్టారు. ముందుగా ఢిల్లీ వెళ్లిన ఆయన... ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్ధిక సాయం అందించారు. అనంతరం ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ తో భేటీ అయ్యారు. అదే క్రమంలో ఇవాళ సాయంత్రం ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవిద్ కేజ్రీవాల్ ను కలవనున్నారు. 

మరిన్ని వార్తల కోసం...

11 దేశాల్లో మంకీపాక్స్ కేసులు

గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద మరో సంచలనం