హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గంగా జమునా తహజీబ్ కు రంజాన్ పర్వదినం ఓ ప్రతీక అని సీఎం కేసీఆర్ అన్నారు. పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా గురువారం ముస్లిం సోదర, సోదరీమణులకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస దీక్షలతో రంజాన్ మాసం శాంతి, ప్రేమ, దయ సౌభ్రాతృత్వ గుణాలను పంచుతుందని చెప్పారు. మైనార్టీల సంక్షేమం కోసం రాష్ర్ట ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ముస్లింల జీవితాల్లో వెలుగులు నింపుతూ గుణాత్మక ఫలితాలను ఇస్తున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు.
