పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ విద్యార్థులతో సమావేశమయ్యారు. ఇటీవల ఉక్రేయిన్ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థులతో ఆమె భేటీ అయ్యారు. విద్యార్థులకు ఎలాంటి నిరాశకు గురికావద్దన్నారు సీఎం. మెడికల్ ఇంటర్న్లకు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో ఇంటర్న్షిప్ ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిస్తుందన్నారు. స్టైఫండ్ కూడా ఇస్తుందని మమత చెప్పారు.
ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం, బెంగాల్ ప్రభుత్వం నామమాత్రపు ఖర్చుతో రాష్ట్రంలో వారి విద్య కోసం ఏర్పాట్లు చేస్తుందన్నారు. 4వ, 5వ & 6వ సంవత్సరాల విద్యార్థులకు ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి అనుమతించమని మేము మెడికల్ కౌన్సెలింగ్ కమిటీని కోరుతామన్నారు సీఎం మమత. ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థులతో ఇంటరాక్ట్ అయిన మమత.. వారి భవిష్యత్తుకు భరోసా కల్పించారు. దీంతో విద్యార్థులు సీఎం మమతకు కృతజ్ఞతలు తెలిపారు.
Kolkata | West Bengal CM Mamata Banerjee interacts with students from Bengal who recently returned from war-torn Ukraine
— ANI (@ANI) March 16, 2022
Don't be depressed or upset. For medical interns, state govt will allow them to start internship at govt medical colleges, will also be given a stipend: CM pic.twitter.com/iU65D5XQbN