ఇందూర్​ఎంపీ స్థానంపై సీఎం ఫోకస్

ఇందూర్​ఎంపీ స్థానంపై సీఎం ఫోకస్
  •    ఇయాళ ఆర్మూర్​, నిజామాబాద్​లో కార్నర్​ మీటింగ్​ 
  •     గత నెల 22న ఎన్నికల సభకు అటెండైన సీఎం 
  •     15 రోజుల గ్యాప్​లో మరో విజిట్​ 
  •     పోలింగ్​ దగ్గరపడుతున్న వేళ క్యాడర్​లో ఫుల్​ జోష్​ 
  •     10న ప్రియాంక రోడ్​ షోకు ప్రయత్నాలు 

నిజామాబాద్​, వెలుగు: నిజామాబాద్​ పార్లమెంట్​ స్థానంలో కాంగ్రెస్​ జెండా ఎగిరేలా సీఎం రేవంత్​రెడ్డి స్పెషల్​ ఫోకస్​ పెట్టారు. గత నెల 22న నిజామాబాద్ లో  ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న సీఎం బుధవారం మరోసారి వస్తున్నారు.  ఆర్మూర్​, నిజామాబాద్​లో రోడ్​షో, కార్నర్​ మీటింగ్​కు అటెండ్ కానున్నారు.  కేవలం15 రోజుల గ్యాప్​లో జిల్లాకు రెండుసార్లు వస్తుండడంతో క్యాడర్​ మస్తు జోష్​లో ఉన్నారు.  కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో  10న  ప్రియాంక గాంధీ ప్రొగ్రాం ఫిక్స్​ అయింది. ఆమెను ఇందూర్​కు రప్పించే ప్రయత్నాలు మరోపక్క ముఖ్య లీడర్లు చేస్తున్నారు. 

గెలుపే లక్ష్యంగా

​ఇందూరు పార్లమెంట్ స్థానానికి 1952 నుంచి  ఇప్పటి వరకు జరిగిన 17 ఎన్నికల్లో 12సార్లు కాంగ్రెస్​ ఎంపీలే గెలిచారు. ఐదుసార్లు మాత్రమే ఇతర పార్టీలు గెలిచాయి. పార్టీకి కంచుకోటగా ఉన్న సెగ్మెంట్​లో ఈసారి విజయబావుటా ఎగరేసి రికార్డు పదిలపర్చుకోవాలని హై కమాండ్​ పట్టుదలతో ఉంది. అభ్యర్థి ఎంపిక విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించి సీనియర్​ నాయకుడైన ఎమ్మెల్సీ జీవన్​రెడ్డిని  బరిలోకి దింపారు.  ప్రచారంతో ఆయన ఇప్పటికే సెగ్మెంట్​ అంతా చుట్టేశారు.  జీవన్​రెడ్డి గెలుపు సవాల్​గా తీసుకున్న సీఎం రేవంత్​రెడ్డి గత నెల 22న నగరంలో నిర్వహించిన భారీ సభకు వచ్చారు.

సెంట్రల్​లో ఏర్పడే కాంగ్రెస్​ గవర్నమెంట్​లో జీవన్​రెడ్డి అగ్రికల్చర్​ మినిస్టర్​ అవుతారని క్యాడర్లో జోష్ నింపేలా రేవంత్​రెడ్డి తన స్పీచ్​లో తెలిపారు.  ఆయన్ను గెలిపించే బాధ్యత ప్రజలు తీసుకోవాలని కోరి వెళ్లారు. పార్లమెంట్​సెగ్మెంట్​లీడర్లను కోఆర్డినేట్​ చేసే బాధ్యతను మరో సీనియర్​ నేత మాజీ మంత్రి సుదర్శన్​రెడ్డికి అప్పగించారు.  

మహిళలు, యూత్​, బీడీ కార్మికులు, కుల సంఘాలతో వేరు వేరు మీటింగ్​లతో దూసుకుపోతున్న జీవన్​రెడ్డి కార్నర్​ మీటింగ్​తో ఓటర్లకు చేరువవుతున్నారు.  రిజల్టుపై  పార్టీ నిర్వహించిన షార్ట్​ సర్వేలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు తేలింది. పార్లమెంట్​ సెగ్మెంట్​లోని మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలకు రెండు సెంటర్లను ఎంపిక చేసి ప్రొగ్రామ్స్ పెట్టారు. ఆర్మూర్​లోని రోడ్​షో, కార్నర్​ మీటింగ్​కు బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల కార్యకర్తలు  వస్తారు. తర్వాత ఇందూర్​ సిటీలో జరిగే కార్యక్రమానికి రూరల్​, బోధన్​, అర్బన్​ ప్రజలు అటెండ్​ అయ్యేలా రూట్​ నిర్ణయించారు.  

ప్రియాంక ప్రొగ్రాం కోసం 

ఈనెల 11న కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డిలో ప్రియాంక గాంధీ రోడ్​ షో  కన్ఫర్మ్​ అయింది.నిజామాబాద్ పార్లమెంట్​ పరిధిలో ఆమె పర్యటన కోసం ప్రయత్నాలు నడుస్తున్నాయి. రూరల్​ సెగ్మెంట్​ను ఇందుకు సెలెక్ట్​ చేశారు.    అరగంట టైం ఉన్నా ప్రియాంక వస్తారని లీడర్లు చెబుతున్నారు.  సీఎం రూట్​ ఇలా.. బుధవారం 5 గంటలకు సీఎం రేవంత్​రెడ్డి ఆర్మూర్​లోని ఆలూరు బైపాస్​ రోడ్​ వద్ద హెలిక్యాఫ్టర్​ దిగుతారు.  అక్కడి నుంచి గోల్​బంగ్లా వరకు కాన్వాయ్‌‌ లో వచ్చి గోల్​బంగ్లా నుంచి అంబేద్కర్​ చౌరస్తా దాకా కార్యకర్తలతో కాలినడకన వస్తారు. అక్కడ కార్నర్​ మీటింగ్​లో ప్రసంగించి నిజామాబాద్​కు రోడ్డు మార్గంలో వస్తారు. గోల్​ హనుమాన్​ టెంపుల్​ నుంచి నెహ్రూ పార్క్​ వరకు  రోడ్​షో నిర్వహించి రాత్రి 9 గంటలకు కార్నర్​ మీటింగ్​కు అటెండవుతారు. తరువాత రోడ్​ మార్గంలో హైదరాబాద్ వెళ్తారు.