- నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు : బడుగు బలహీన వర్గాలు, మహిళల సాధికారతకు పాటుపడిన మహనీయుడు అంబేద్కర్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశ భవిష్యత్ను ముందుగానే ఊహించి దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించి భావితరాలకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. అంబేద్కర్133వ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సేవలను రేవంత్ గుర్తుచేసుకున్నారు.
దేశ పురోగతికి పునాదులు వేసిన వ్యక్తి అంబేద్కర్ అని చెప్పారు. ఆయన ఆశయ సాధనకు అందరూ కట్టుబడి ఉండాలని సూచిం చారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే తెలంగాణ రాష్ట్రానికి జీవం పోసిందని తెలిపారు. ఆయన స్ఫూర్తితోనే రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి పాటు పడుతున్నదని వివరించారు. దళితుల అభ్యున్నతిలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు.