హైదరాబాద్ ఓఆర్ఆర్ కారు ప్రమాదంలో లాస్య నందిత మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.లాస్య మృతి చాలా బాధ కలిగించిందన్నారు. లాస్య నందిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. సాయన్న కుటుంబంతో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
కంటోన్మెంట్ శాసన సభ్యులు లాస్య నందిత అకాల మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నందిత తండ్రి దివంగత ఎమ్మెల్యే సాయన్నతో నాకు సన్నిహిత సంబంధం ఉండేది. ఆయన గతేడాది ఇదే నెలలో చనిపోయారు. ఇదే నెలల నందిత కూడా ఆకస్మికంగా మృతిచెందడం అత్యంత విషాదకరం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను.. ఆమె ఆత్మతకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం కొలువు తీరింది.
— Revanth Reddy (@revanth_anumula) December 7, 2023
బానిసత్వపు సంకెళ్లు బద్దలయ్యాయి.
ఇక తెలంగాణ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటుంది.
సామాజిక న్యాయం, సమాన అభివృద్ధితో తెలంగాణ ఉజ్వలంగా వెలుగుతుంది. పేదల మొఖాలలో వెలుగులు వెల్లివిరుస్తాయి.
హక్కుల రెక్కలు విచ్చుకుంటాయి.
నా తెలంగాణ ఆకాంక్షలు… pic.twitter.com/AmZfpFhqcn