హైదరాబాద్, వెలుగు: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలకు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని శివుడిని ప్రార్థించారు. శివరాత్రి ఉపవాస పూజలను నిర్వహిస్తున్న భక్తులందరికీ శివ య్య ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని సీఎం ఆకాంక్షించారు.
