హజ్ యాత్రను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

హజ్ యాత్రను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి చెందిన యాత్రికులు హజ్ యాత్రకు బయలుదేరారు. శుక్రవారం హైదరాబాద్‌‌‌‌లోని నాంపల్లి హజ్‌‌‌‌హౌస్‌‌‌‌ వద్ద హజ్ యాత్రికుల బస్సులను సీఎం రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. హజ్ యాత్ర సురక్షితంగా సాగాలని ఆయన ఆకాంక్షించారు.

 ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీలు అసదుద్దీన్ ఒవైసీ, అనిల్ కుమార్ యాదవ్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు.