సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచే పోరాటం చేశారు : వివేక్ వెంకటస్వామి

సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచే పోరాటం చేశారు : వివేక్ వెంకటస్వామి

సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యాక ఆదిలాబాద్ జిల్లా నుంచే కేసీఆర్ పై పోరాటం చేయడం ప్రారంభించారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇంద్రవెల్లిలో దళిత గిరిజన పోరుబాట బహిరంగ సభతో బీఆర్ఎస్ ప్రభుత్వం పై రేవంత్ రెడ్డి పోరాటం చేశారని గుర్తు చేశారు. అక్కడ నుండి స్టార్ట్ అయిన ఉద్యమం వలనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని తెలిపారు.

 మళ్లీ ఇంద్రవెల్లి నుంచే కాంగ్రెస్ పార్టీ వచ్చే పార్లమెంటు ఎన్నికల కోసం సమర శాంఖారావం పూరించనున్నట్టు వివేక్ వెంకటస్వామి చెప్పారు. రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధాని చేయడం కోసం కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అందరూ సైనికుల వలే పోరాటం చేయాలని వివేక్ వెంకటస్వామి సూచించారు.