హైదరాబాద్: విదేశీ పర్యటన ముగించుకుని సీఎం రేవంత్రెడ్డి హైదరాబాద్ కు తిరిగొచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కాగా, స్విట్జర్లాండ్లోని దావోస్ జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం పాల్గొని దాదాపు రూ.40 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నారు.
గతేడాది సమ్మిట్లో రూ.19,900 కోట్లు మాత్రమే వస్తే ఈసారి మాత్రం రెండింతల కంటే ఎక్కువ వచ్చాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రికార్డు స్థాయిలో పెట్టుబడులు రావడం అధికారులు, మంత్రుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపినట్లు అయ్యింది. లండన్, దుబాయ్ లోనూ సీఎం రేవంత్ పర్యటించారు. వారంరోజులపాటు జరిగిన ఫారిన్టూర్ లో ముఖ్యమంత్రి వెంట మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు ఉన్నారు.