
రాజకీయ విభేదాలున్నా బనకచర్లపై పార్టీలన్నీ కలిసి కట్టుగా పోరాడుదామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జూన్ 19న ప్రధాని మోదీ సహా పలువురు కేంద్రమంత్రులను కలిసి తమ వాదన వినిపిస్తామన్నారు. పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ పై మూడు రకాలుగా ముందుకెళ్తామన్నారు. టెక్నికల్ గా, లీగల్ గా,పొలిటికల్ గా ముందుకెళ్దామని చెప్పారు. పొలిటికల్ గా ప్రయత్నాలు ఫలించకపోతే న్యాయపోరాటం చేద్దామని చెప్పారు రేవంత్.
రేవంత్ కీలక కామెంట్స్
- 3వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తాయని కేసీఆర్ చెప్పారు
- 3 వేల బ్రహ్మ పదార్థం ఎక్కడ పుట్టిందో ముందు తెల్వాలి
- 2019లో ఏపీకి వెళ్లిన కేసీఆర్ రాయలసీమను రతనాల సీమను చేస్తామన్నారు
- గోదావరి జలాలను సీమకు తరలించేలా కేసీఆర్ ,జగన్ ప్లాన్ చేశారు
- సీమ వెనుకబాటు తనానికి గోదావరి జలాల తరలింపే పరిష్కారమని కేసీఆర్ చెప్పారు.
- 2016లో ఉమాభారతి అధ్యక్షతన ఢిల్లీ ఇరురాష్ట్రాల సీఎంల భేటీ జరిగింది
- నాడు ఈ భేటీలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు
- ఎంపీలు విలువైన సలహాలు ఇచ్చయారు
- బనకచర్లపై ముందుకెళ్లాలంటే అందరి సహకారం అవసరం
- బనకచర్లపై భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తాం
- తెలంగాణ రైతులకు గోదావరి కృష్ణా నీళ్లు ముఖ్యం
- రైతుల ప్రయోజనాల కంటే మాకేం ముఖ్యం కాదు
- ఈ అంశంపై ఎలా ముందుకెళ్లాలనేదానిపై పార్టీలు అభిప్రాయాలు చెప్పాయి
- రేపు ప్రధాని సహా కేంద్రమంత్రులను కలిసి మా వాదన వినిపిస్తాం
- ఫైనాన్స్,జలశక్తి పర్యావరణ మంత్రులను కలుస్తాం
- పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ పై మూడు రకాలుగా ముందుకెళ్తాం
- లీగల్, టెక్నికల్, పొలిటికల్ గా ముందుకెళ్దాం
- పొలిటికల్ గా మా ప్రయత్నాలు ఫలించకపోతే న్యాయపోరాటం చేద్దాం
- ఈ బేటీలో బనకచర్ల ప్రాజెక్ట్ చేపట్టొద్దని తీర్మానం చేద్దాం
- తీర్మానం చేస్తే ఈ సమావేశం ఉద్దేశం నెరవేరుతుంది
- సీఆర్ పాటిల్ దగ్గరకు వెళ్లేటప్పుడు కిషన్ రెడ్డిని తీసుకెళ్తాం
- రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేద్దాం
- భవిష్యత్ లో కేంద్రంతో మంచి సంబంధాలు కొనసాగిస్తాం
- అఖిలపక్షం నుంచి బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు వాకౌట్
- సీఎం రాజకీయంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ అభ్యంతరం