
- ప్రవేశపెట్టనున్న సీఎం రేవంత్
- అన్ని రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాల సేకరణ
హైదరాబాద్, వెలుగు: 25 ఏండ్లపాటు డీలి మిటేషన్ వాయిదా వేయాలని, జనాభా దామాషా, ప్రొరేటా ప్రకారం లోక్సభ నియో జకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా అసెంబ్లీలో సోమవారం తీర్మానం చేయనున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం డీలిమిటేషన్పై వ్యవహరిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రవేశ పెడతారు. అనంతరం సభలోని రాజకీయ పక్షాలు అభిప్రాయాలు వెల్లడించనున్నాయి.
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలో డీలిమిటేషన్పై చెన్నైలో నిర్వహించిన దక్షిణా ది రాష్ట్రాల రాజకీయ పార్టీల జేఏసీలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నారు. తెలంగాణ అసెంబ్లీలో డీలిమిటేషన్కు వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని ఈ మీటింగ్లో సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. డీలిమిటేషన్పై త్వరలోనే హైదరాబాద్లో జేఏసీ తదుపరి సమావేశం నిర్వహిస్తామని, ఇందులో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు భారీ బహిరంగ సభను కూడా నిర్వహిస్తామని తెలిపారు.
ఈ నేపథ్యంలోనే సోమవారం సభలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపించనున్నారు. రాష్ట్రంలో డీలిమిటేషన్ను బీజేపీ మినహా మిగిలిన పక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. తమ రాజకీయ ప్రాతినిధ్యం తగ్గేలాచేసి నామమాత్రం చేసేలా బీజేపీ కుట్ర చేస్తున్నదని దక్షిణాది రాష్ట్రాలు పేర్కొంటున్నాయి. జనాభా ఆధారంగా లోక్సభ స్థానాల పెంపును మరో 25 ఏండ్ల పాటు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అది సాధ్యం కాకుంటే రాష్ట్రాలు సూచించే ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నాయి.