తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి అత్యంత కీలకమైన అడుగు వేశారు. ప్రాజెక్టు రీ-డిజైనింగ్, ఎత్తు పెంపు అంశాలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు సీఎం రేవంత్ రెడ్డి కీలక లేఖ రాశారు. తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ఎత్తుపై సుదీర్ఘ చర్చకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
గతంలో ప్రతిపాదించిన 148 మీటర్ల FRL (Full Reservoir Level) తెలంగాణ నీటి అవసరాలకు ఏమాత్రం సరిపోదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. బ్యారేజ్ ఎత్తు పెంపుపై మరోసారి ఇరు రాష్ట్రాలు సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశంపై చర్చించేందుకు తెలంగాణ ఉన్నతాధికారులు, ప్రతినిధుల బృందానికి సమయం ఇవ్వాలని... త్వరలోనే సమావేశ తేదీని ఖరారు చేయాలని మహారాష్ట్ర సీఎంను కోరారు.
తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ఎత్తు పెంచడం వల్ల ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్తో పాటు మెదక్ జిల్లాల నీటి అవసరాలు తీరుతాయి. FRL పెంచితే ఎలాంటి మోటార్లు లేకుండా, కేవలం గ్రావిటీ (గురుత్వాకర్షణ) ద్వారానే తెలంగాణకు నీటిని తరలించవచ్చు. దీనివల్ల మహారాష్ట్రలో ముంపు ప్రభావం కూడా చాలా తక్కువగానే ఉంటుంది అని సీఎం రేవంత్ రెడ్డి లేఖలో తెలిపారు
