కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్

కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్

తెలంగాణ  అభివృద్ధి విషయంలో పూర్తి సహాయసహకారాలు అందించాలని  సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కోరారు. ఈ మేరకు సీఎం ఆయనకు ఫోన్ చేశారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న పలు పెండింగ్ అంశాలు, పరస్పర సహకారం కోసం కేంద్ర ప్రభుత్వ ముఖ్యులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కిషన్‌ రెడ్డిని సీఎం కోరారు.  కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై పరస్పర సహకారం ఉండాలని సీఎం కోరారు.  

మరోవైపు ధరణి పోర్టల్‌పై సీఎం రేవంత్‌ రెడ్డి సచివాలయంలో కీలక సమీక్ష నిర్వహించారు. ధరణి పోర్టల్‌పై సీసీఎల్‌ఏ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్ ఇచ్చారు.  ధరణి పోర్టల్‌పై  పది రోజుల్లో  సమగ్ర నివేదిక ఇవ్వాలని  సీఎం అధికారులను ఆదేశించారు.  ధరణి పోర్టల్ రూపకల్పన ఎవరికి ఇచ్చారు. టెండర్ పిలిచారా? ఏ ప్రాతిపదికన వెబ్‌సైట్‌ క్రియేట్ చేసేందుకు అవకాశం ఇచ్చారని సీఎం ప్రశ్నించారు.