చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను పరామర్శించిన సీఎం రేవంత్

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను పరామర్శించిన సీఎం రేవంత్

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. రెండు రోజుల క్రితం అల్వాల్ లో పంచశీల కాలనీలోని నివాసంలో ఎమ్మెల్యే సతీమణి రూపాదేవి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఎం రేవంత్.. కొంపల్లిలోని ఎమ్మెల్యే సత్యం నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను సీఎం రేవంత్ ఓదార్చారు.  

అనంతరం ఎక్స్ వేదికగా.. "భార్యావియోగంతో దుఖంలో ఉన్న సోదరుడు, శాసనసభ్యుడు మేడిపల్లి సత్యం,  ఆయన కుటుంబ సభ్యులను కొంపల్లిలోని ఆయన నివాసంలో పరామర్శించాను. సత్యం సతీమణి శ్రీమతి రుపాదేవి అకాల మరణం చెందడం బాధాకరం. వారి ఆత్మకు శాంతిచేకూరాలని  భగవంతుడిని ప్రార్థిస్తూ.. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి" అని చెప్పారు.

కాగా కొంతకాలంగా ఎమ్మెల్యే సత్యం దంపతుల మధ్య విభేదాలు ఉన్నట్టు తెలుస్తోంది. రూపాదేవి ఓ స్కూలులో టీచర్​గా పనిచేస్తున్నట్లు సమాచారం. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.