మా పథకాలే మళ్లీ గెలిపించాయి : సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్

మా పథకాలే మళ్లీ గెలిపించాయి : సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్

ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్లే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ విజయం  సాధించింది.  లాడ్లీ స్కీమ్ ప్రజల జీవితాలను మెరుగుపరిచింది. ప్రధాని మోదీ మధ్యప్రదేశ్ ప్రజల హృదయాల్లో  ఉన్నారు. మా ప్రభుత్వం అమలు చేసిన స్కీములు రాష్ట్ర ప్రజల జీవితాలను మెరుగుపరిచాయి. ఎన్నికల్లో విజయం కోసం అందరం కలిసి కష్టపడి పనిచేశాం.

-  సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్

నా ఎత్తు ఎంతో ప్రజలే చెప్పారు

నా ఎత్తు గురించి ఓ నేత మాట్లాడారు. నా ఎత్తు ఎంత అనేది ఆ నేతకు ఇప్పుడు గ్వాలియర్, మాల్వా ప్రజలు తెలియజేశారు. బీజేపీ గెలుస్తుందని గతంలోనే చెప్పా. భారీ మెజారిటీ ఇచ్చిన ఓటర్లకు ధన్యవాదాలు. రాష్ట్రంలో పార్టీ విజయానికి కారణం కేంద్రంలో మోదీ అనుసరించిన విధానాలే. మోదీ, అమిత్​ షా, జేపీ నడ్డాలదే ఈ విజయం. నేనొక సామాన్య కార్యకర్తను మాత్రమే.

- జ్యోతిరాదిత్య సింధియా