అఖిలేష్పై శివరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

అఖిలేష్పై శివరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. యూపీలో ప్రచారం నిర్వహిస్తున్న మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాంపూర్లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన.. అఖిలేష్ను ఔరంగ జేబుతో పోల్చారు. తండ్రి ములాయం సింగ్ యాదవ్తోనే నమ్మకంగా లేని వ్యక్తి ప్రజలతో ఎలా విశ్వసనీయంగా ఉంటారని ప్రశ్నించారు. ఈ విషయాన్ని తాను అనడంలేదని, ములాయం స్వయంగా చెప్పారని అన్నారు. "గతంలో ఔరంగజేబు ఇలాగే వ్యవహరించాడు. తన తండ్రి షాజహాన్ ను కారాగారంలో బంధించాడు. తన తోబుట్టువులను చంపేశాడు. అఖిలేష్ అవమానించినట్లు తనను ఇంకెవరూ అవమానించలేదని ములాయం సింగ్ స్వయంగా చెప్పారు." అని శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు. 

అఖిలేష్ను ఫ్లాప్ సినిమా దర్శకులతో పోల్చిన శివరాజ్ సింగ్ చౌహాన్.. అఖిలేష్ యాదవ్ ఏర్పాటుచేసిన కూటములన్నీ ఫ్లాపులే అని చురకలంటించారు. గతంలో రాహుల్తో చేతులు కలుపగా రెండు పార్టీలు గాల్లో కలిసిపోయాయని, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు వారికి గుణపాఠం చెప్పారని అన్నారు. 2019లో మాయవతితో కలిసి అద్భుతాలు సృష్టిద్దామనుకున్నా ఇప్పుడు ఒకరి ముఖం ఇంకొకరు చూసుకునే పరిస్థితి లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం అఖిలేష్.. జయంత్ చౌదరీ చేతులు పట్టుకున్నారని, ఈసారి కూడా విధ్వంసం తప్పదని శివరాజ్ జోస్యం చెప్పారు.