
హైదరాబాద్: ఏపీ నుంచి హైదరాబాద్ కు ట్రీట్ మెంట్ కోసం వచ్చే కరోనా రోగుల అంబులెన్సులను ఆపకుండే తెలంగాణ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. చెక్ పోస్టుల్లో అడ్డుకోవడం సరికాదన్నారు. మానవత్వంతో ఆలోచించి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తక్షణమే ఈ సమస్య పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. ఏపీ కరోనా రోగులకు తెలంగాణలోకి అనుమతి లేక పోవడంతో యస్.శివారెడ్డి అనే వ్యక్తిని కర్నూలు ఆస్పత్రిలో చేర్పించడం జరిగిందన్నారు. కరోనా రోగుల అనుమతి విషయంలో నెలకొన్న ప్రతిష్టంభన తొలగించే దిశగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.