గండిపేట, వెలుగు: శంషాబాద్ ఎయిర్పోర్టులోని నిలోఫర్ అవుట్లెట్లో ఆదివారం బొద్దింక కనిపించడం కలకలం రేపింది. ప్రయాణికులు, వినియోగదారులు ఈ విషయమై యాజమాన్యాన్ని ప్రశ్నించగా.. వారు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు తనిఖీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నిలోఫర్ నిర్వహణపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని కోరారు.
