రైతులను మోసం చేయొద్దు : కలెక్టర్​ జితేశ్​ వీ పాటిల్​

రైతులను మోసం చేయొద్దు : కలెక్టర్​ జితేశ్​ వీ పాటిల్​
  •     కలెక్టర్​ జితేశ్​ వీ పాటిల్​

కామారెడ్డి, వెలుగు : ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు అమ్మే డీలర్లు వ్యవసాయం​పై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ ​జితేశ్​వీ పాటిల్​ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్​లో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) ఆధ్వర్యంలో అగ్రికల్చర్​ విస్తరణ సేవ డిప్లొమా కోర్సులో ఉత్తీర్ణులైన వారితో మీటింగ్​నిర్వహించారు. కలెక్టర్​ జితేశ్​ మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలు, ఎరువులను రైతులకు అమ్మి, వారిని మోసం చేయొద్దన్నారు.

అగ్రికల్చర్​లో డ్రోన్ ​టెక్నాలజీ వినియోగం, పంటలకు వ్యాపించే తెగుళ్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించాలన్నారు. డిప్లొమా కోర్సులో పాస్​ అయిన వారికి సర్టిఫికెట్లు అందించారు. జిల్లా అగ్రికల్చర్​ఆఫీసర్​ భాగ్యలక్ష్మి, ఏడీఏలు రత్న, భారతి, లక్ష్మీప్రసన్న, అనిల్​​కుమార్ ​పాల్గొన్నారు.

ఈవీఎంలపై అవగాహన కల్పించాలి

ఈవీఎంల వినియోగంపై ఓటర్లకు పూర్తి అవగాహన ఉండాలని కలెక్టర్​ జితేశ్ ​వీ పాటిల్​పేర్కొన్నారు. కలెక్టరేట్​ఆవరణలో ఏర్పాటు చేసిన ఈవీఎం డెమోను శుక్రవారం ఆయన పరిశీలించారు. పార్లమెంట్​ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి తడబాటుకు గురికాకుండా ఈవీఎంలో ఓటేయాలని సూచించారు. ఎలక్షన్​ఆఫీసర్లు ప్రవీణ్, అనిల్​కుమార్, ఇందిరా ప్రియదర్శిని పాల్గొన్నారు.