పార్లమెంట్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : క్రాంతి వల్లూరు

పార్లమెంట్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : క్రాంతి వల్లూరు

సంగారెడ్డి టౌన్, వెలుగు:ఈ నెల13న జరిగే పార్లమెంట్​ఎన్నికలకు అన్ని ఏర్పాటు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్​క్రాంతి తెలిపారు. గురువారం సంగారెడ్డి కలెక్టర్​ఆఫీసులో ఎస్పీ రూపేశ్​తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. 13న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. ఎన్నికల కమిషన్ సూచించిన మేరకు 13 రకాల గుర్తింపు పొందిన ధ్రువీకరణ పత్రాలను ఓటింగ్​ సెంటర్​కు తీసుకొని వెళ్లాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు, సిబ్బందికి అవసరమైన అన్ని వసతులు కల్పించామని స్పష్టం చేశారు.

 ప్రతి పోలింగ్ స్టేషన్​లో సీసీ కెమెరాల ఏర్పాటు, వెబ్ కాస్టింగ్ ఉంటుందని తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు ఈనెల10 వరకు పోస్టల్ బ్యాలెట్ ను ఉపయోగించుకోవచ్చాన్నారు. పోలింగ్​కు 48 గంటల ముందు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు రూ.2 కోట్ల 97 లక్షల నగదు, 3 లక్షల 50 వేల లీటర్ల మద్యాన్ని, 44. 5 గ్రాముల బంగారాన్ని అధికారులు సీజ్ చేసినట్లు తెలిపారు. ఎస్పీ రూపేశ్ మాట్లాడుతూ ఎవరూ ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా ఓటుహక్కును వినియోగించుకోవాలన్నారు.