ప్రధాని సభ ఏర్పాట్ల పరిశీలన: జి.రవి నాయక్

ప్రధాని సభ ఏర్పాట్ల పరిశీలన:  జి.రవి నాయక్

భూత్పూర్, వెలుగు: మండల కేంద్రంలోని అమిస్తాపూర్ లో అక్టోబర్ 1న జరిగే ప్రధాని మోదీ విజయ సంకల్ప భేరి సభా వేదికను మంగళవారం కలెక్టర్  జి.రవి నాయక్, ఎస్పీ నరసింహ పరిశీలించారు. ప్రధాని సభ కోసం 14 ఎకరాల మైదానం అవసరమని, సభా వేదికకు ఇరువైపులా ఉన్న పోల్స్​ను తొలగించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. రైతులతో మాట్లాడి పంట భూములను చదును చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. 

సమావేశం నిర్వహణ కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లపై సంబంధిత అధికారులు, బీజేపీ నాయకులతో మాట్లాడారు. ఆయన  వెంట భూత్పూర్ సీఐ రామకృష్ణ, ఎస్ఐ శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీర బ్రహ్మచారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సుదర్శన్ రెడ్డి ఉన్నారు. 

c