81 రైస్ మిల్లులకు నోటీసులు: కలెక్టర్ ఆర్వీ కర్ణన్

81 రైస్ మిల్లులకు నోటీసులు: కలెక్టర్ ఆర్వీ కర్ణన్

కరీంనగర్ టౌన్, వెలుగు: జిల్లాలో కస్టమ్ ​మిల్లింగ్​రైస్​ ఇవ్వని 81 మిల్లులకు నోటీసులు ఇవ్వాలని సివిల్​సప్లై ఆఫీసర్లను కలెక్టర్​ఆర్వీ కర్ణన్​ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో రైస్‌మిల్లర్లతో రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2022-–-23 వానాకాలం వడ్లకు సంబంధించి కస్టమ్ మిల్లింగ్ రైస్​ ఇవ్వాలని, లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. రైస్​అప్పగింతపై వారంలోపు పురోగతి కన్పించాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్  శ్యాంప్రసాద్ లాల్, ట్రైనీ కలెక్టర్ నవీన్ నికోలస్ పాల్గొన్నారు.

ఎలక్టోరల్ రోల్ పరిశీలించిన ఎలక్షన్​ కమిషన్​జిల్లాలో నిర్వహిస్తున్న ఎలక్టోరల్ రోల్ ను ఎలక్షన్ కమిషన్ సభ్యులు ఎస్‌బీ జోషి, ఎస్‌హెచ్​ప్రఫుల్ అవాస్తి పరిశీలించారు.  ఈ సందర్భంగా బూత్ లెవల్ అధికారులు, సూపర్ వైజర్లతో సమీక్షించారు.  ఇంటింటి సర్వే  రికార్డులను పరిశీలించారు.