రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల, వెలుగు : రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమర్జెన్సీ, ఐసీయూ, మెటర్నిటీ, ఆర్థోపెడిక్, మేల్ వార్డుల్లో అందిస్తున్న సేవలను ఆయన పరిశీలించారు. అనంతరం పలువురు రోగులతో మాట్లాడారు. ఇక్కడ సేవలు ఎలా అందుతున్నాయో ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రతి రోగికి ఉత్తమ సేవలు అందించాలని సూచించారు. తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేట గ్రామంలో ఫీవర్ సర్వే చేయాలని జిల్లా వైద్యాధికారి రజితను ఆదేశించారు.