
గద్వాల, వెలుగు: పెన్షన్లు సామాజిక భద్రత కలిగిస్తాయని, వాటి అమలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సంతోష్ ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లో చేయూత పథకంపై మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అర్హులకు సామాజిక భద్రత పెన్షన్ అందించేలా ఆఫీసర్లు సమన్వయంతో పని చేయాలన్నారు. ప్రతి మండలంలో కనీసం 20 కుటుంబాలను గుర్తించి, నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీం ద్వారా ఆర్థికసాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
చనిపోయిన పెన్షన్ దారుల వివరాలు సేకరించి, వారి స్థానంలో కుటుంబంలోని అర్హులైన వారికి పెన్షన్ మంజూరు చేసేందుకు ప్రపోజల్ పంపించాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పనులను స్పీడప్ చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో గత వారం 30 స్థానంలో ఉండగా, ప్రస్తుతం గద్వాల జిల్లా 15వ స్థానానికి చేరుకోవడం సంతోషకరమన్నారు. అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు, సెర్ప్ సోషల్ సెక్యూరిటీ పెన్షన్ పంపిణీ డైరెక్టర్ గోపాలరావు, డీపీవో నాగేంద్రం పాల్గొన్నారు.