నయీంనగర్ బ్రిడ్జి పనులకు జూన్ 15 డెడ్ లైన్​

నయీంనగర్ బ్రిడ్జి పనులకు జూన్ 15 డెడ్ లైన్​
  •     ఆఫీసర్లకు కలెక్టర్ సిక్తా పట్నాయక్​ ఆదేశాలు

హనుమకొండ, వెలుగు : నయీంనగర్​ బ్రిడ్జితో పాటు నాలా డెవలప్ మెంట్ వర్క్స్​ జూన్ 15లోగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్​ సంబంధిత అధికారులను ఆదేశించారు. వానకాలం ప్రారంభం నాటికి పనులన్నీ పూర్తి కావాలని, ఈ మేరకు ఆయా పనుల్లో వేగం పెంచాలని సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లో గ్రేటర్​ కమిషనర్ అశ్వినీ తానాజీ వాఖడేతో కలిసి  రెవెన్యూ, మున్సిపల్, టౌన్ ప్లానింగ్, సాగునీటి పారుదల

ఇంజినీరింగ్ అధికారులతో కలెక్టర్ రివ్యూ చేశారు. కొనసాగుతున్న నిర్మాణ పనులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఇరిగేషన్​ అధికారులు నయీంనగర్ నాలా డెవలప్ మెంట్ వర్క్స్​, బ్రిడ్జి పనుల గురించి కలెక్టర్ కు వివరించారు. సమావేశంలో హనుమకొండ ఆర్డీవో వెంకటేశ్, తహసీల్దార్ విజయ్ కుమార్, జీడబ్ల్యూఎంసీ ఈఈ రాజయ్య, ఇరిగేషన్ ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఈఈ ఆంజనేయులు, డీఈ హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.