గద్వాల జిల్లాలో భూ సమస్యలపై దృష్టి పెట్టండి : కలెక్టర్  వల్లూరు క్రాంతి

గద్వాల జిల్లాలో  భూ సమస్యలపై దృష్టి పెట్టండి : కలెక్టర్  వల్లూరు క్రాంతి

గద్వాల, వెలుగు: ధరణి, రెవెన్యూ, ఇనాం భూములకు సంబంధించిన సమస్యలపై దృష్టి పెట్టి పెండింగ్ లో ఉన్న ఫిర్యాదులను వెంటనే క్లియర్  చేయాలని కలెక్టర్  వల్లూరు క్రాంతి తహసీల్దార్లను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్  మీటింగ్ హాల్ లో తహసీల్దార్లతో ఏర్పాటు చేసిన మీటింగ్ లో ఆమె మాట్లాడుతూ అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రతి దరఖాస్తుపై ఫీల్డ్  వెరిఫికేషన్  పూర్తి చేయాలన్నారు.

డెత్  కేసులకు సంబంధించి కుటుంబసభ్యుల దృవీకరణ పత్రం తప్పకుండా ఉండేలా చూడాలన్నారు. భారత్  మాల రోడ్డులో భూములకు సంబంధించిన వివాదాలను వారం లోగా క్లియర్ చేయాలన్నారు. అడిషనల్  కలెక్టర్  శ్రీనివాస్  పాల్గొన్నారు.